హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): కడప ఎంపీ అవినాశ్రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పెట్టుకున్న పిటిషన్పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సీబీఐ వాదనలు విన్నాక కేసును శనివారానికి వాయిదా వేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య జరిగిన తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్కు ముందుగా సమాచారం ఎలా వెళ్లిందనే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ హైకోర్టుకు నివేదించింది.
ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అవినాశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కోరింది. అవినాశ్ దర్యాప్తునకు సహకరించటం లేదని, ఒక నోటీస్కు నాలుగు రోజుల గడువు కావాలని కోరారని సీబీఐ తరుఫు న్యాయవాది తెలిపారు.