హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఈ నెల నుంచి ఆర్థిక లావాదేవీలను డిజిటలైజ్ విధానంలోనే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎఫ్ఎంఐఎస్) ద్వారా బిల్లులను పూర్తిగా పేపర్ లెస్ విధానంలో సమర్పించి, ప్రాసెస్ చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆగస్టు 15 నుంచి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు (డీడీవో) బిల్లులను డిజిటల్ సంతకంతో, అవసరమైన పత్రాలను సాన్ చేసి ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలని ఆదేశించారు.