హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు ముస్లిం మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్నది. సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ మైనార్టీలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పించే దిశగా వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నది. పేద మైనార్టీల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం ఆచరణాత్మక విధానాన్ని అమలు చేస్తున్నది. 2022-23 బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.1724.69 కోట్లు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో సమానంగా మైనార్టీల కోసం షాదీముబారక్ను అమలు చేస్తున్నది.
2014-15 నుంచి ఇప్పటివరకు ఒకొకరికి రూ.1,00,116 చొప్పున 2,28,200 మంది మైనార్టీ ఆడబిడ్డల పెండ్లికి మొత్తంగా రూ.2,165 కోట్ల ఆర్థిక సహాయం అందజేసింది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఓన్ యువర్ ఆటో, డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకం, కుట్టు మిషన్ల పంపిణీ, సబ్సిడీ బ్యాంక్ రుణాలు, సిల్ డెవలప్మెంట్, తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ఫకీర్ కమ్యూనిటీ సంక్షేమార్థం 110 మోపెడ్స్ను పంపిణీ చేసింది. రంజాన్ సందర్భంగా గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ, ప్రతి నెలా ఇమామ్లకు రూ.10 వేలు, మౌజమ్లకు రూ.5వేల గౌరవ వేతనం అందిస్తున్నది. మైనార్టీసంక్షేమ శాఖలో 66 మంది ఉర్దూ ట్రాన్స్లేటర్లను నియమించింది. మకా మసీదు మరమ్మతుల కోసం రూ. 8.48 కోట్లు , అనీసుల్ గుర్బాకు రూ.39 కోట్లు , జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధికి 50 కోట్లు కేటాయించింది. రూ.14.65 కోట్లతో జామియా -నిజామియా ఆడిటోరియం, రూ.40 కోట్లతో ఇస్లామిక్ కల్చరల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాన్ని చేపట్టింది.
ముస్లిం మైనార్టీల విద్యాభివృద్ధికి తెలంగాణ సర్కారు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నది. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించి వారికి విలువతో కూడిన విజ్ఞానాన్ని అందించడం, తద్వారా ఉత్తమ పౌరులుగా వారిని తీర్చిదిద్దాలనే లక్ష్యంగా కృషిచేస్తున్నది. కేజీ టు పీజీ విద్యలో భాగంగా మైనార్టీలకు ఉచిత విద్యను ఉన్నత ప్రమాణాలతో అందించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 2014 మైనార్టీ గురుకులాలను ప్రారంభించింది. వీటిలో 107 బాలుర, 97 బాలికల రెసిడెన్షియల్ విద్యాసంస్థలు. చాలాచోట్ల వాటిని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ కూడా చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,30,560 మంది విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యను అందిస్తున్నది.
ఐఐటీ, జేఈఈ, ఎంసెట్ తదితర పోటీపరీక్షలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ మైనార్టీ విద్యార్థులు జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేందుకు తోడ్పాటును ప్రభుత్వం అందిస్తున్నది. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలని అభిలషించే మైనార్టీ విద్యార్థులకు సీఎం ఓవర్సీస్ సాలర్షిప్ పథకాన్ని ప్రారంభించి, ఒకొకరికి 20 లక్షల చొప్పున 2015 నుంచి ఇప్పటివరకు 2,725 మందికి రూ.436 కోట్ల ఆర్థికసాయం అందించి అండగా నిలిచింది. మైనార్టీ విద్యార్థుల పోస్ట్మెట్రిక్ సాలర్ షిప్లో రూ.40 కోట్లు , ట్యూషన్ ఫీజు రీయంబర్స్మెంట్కు రూ.150 కోట్లు కేటాయించింది. వివిధ 100 మంది మైనారిటీ విద్యార్థులకు ఐఏఎస్ కోచింగ్ ఇప్పించింది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా 9 స్టడీ సర్కిళ్ల ద్వారా మైనార్టీ యువతకు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణను అందిస్తున్నది.