హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాలను తాత్కాలికంగా 66ః34 నిష్పత్తిలో వినియోగించుకునేందుకు గతంలో ఆంధ్రప్రదేశ్తో చేసుకున్న ఒప్పందానికి ఇక ఎంతమాత్రం ఒప్పుకునేది లేదని, వెంటనే ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసి న్యాయమైన నీటి వాటాలను తేల్చాలన్న డిమాండ్ను యథాతథంగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశ మినిట్స్లో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టింది.
ఈ మేరకు కేఆర్ఎంబీకి లేఖ రాసింది. ఇటీవల బోర్డు 17వ సమావేశాన్ని నిర్వహించిన కేఆర్ఎంబీ.. ఆ సమావేశ మినిట్స్ను సంబంధిత రాష్ర్టాలకు అందజేసింది. కానీ, ఆ సమావేశంలో పలు అంశాలపై తెలంగాణ వ్యక్తం చేసిన అభిప్రాయాలను పూర్తిస్థాయిలో బోర్డు నమోదు చేయకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుపట్టింది.