మిర్యాలగూడ రూరల్, జూన్ 23: తెలంగాణలోని గ్రామాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయని, పచ్చదనం, పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని జార్ఖండ్ రాష్ర్టానికి చెందిన జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల బృందం సభ్యు లు ప్రశంసించారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధిని తెలుసుకునేందుకు శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మం డలం శ్రీనివాస్నగర్ గ్రామ పంచాయతీని వారు సందర్శించారు.
గ్రామంలో ని కార్యక్రమాలను పరిశీలించారు. ప్ర తి ఇంటిలో నిర్మించిన మరుగుదొడ్లు, వైకుంఠధామం, సీసీ రోడ్లు, పారిశుధ్య పనులను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ ఉచితంగా నీరందించడాన్ని కొనియాడారు. తమ రాష్ట్రంలో కూడా తెలంగాణ మాదిరిగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.