హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో బృందం స్పెయిన్ పర్యటనకు బయలుదేరింది.
ఈ నెల 28 వరకు జరిగే ఎఫ్ఐటీయూఆర్ ఇంటర్నేషనల్ టూరిజం ట్రేడ్ ఫెయిర్లో పాల్గొనేందుకు రాష్ట్ర బృందం స్పెయిన్ రాజధాని మాడ్రిడ్కు చేరుకున్నది. పర్యటనలో ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్య ర్, డైరెక్టర్ నిఖిల, ఎండీ రమేశ్నాయుడు ఉన్నారు.