హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎంతో అద్భుతమని తమిళనాడు అధికార బృందం ప్రశంసించింది. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలవుతున్న పథకాలను తెలుసుకునేందుకు తమిళనాడు ఆది ద్రావిడర్ హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఏడీహెచ్డీసీవో) ఎండీ, ఐఏఎస్ కందస్వామి నేతృత్వంలో 11 మంది అధికారుల బృందం రాష్ర్టానికి గురువారం వచ్చింది. సంక్షేమ భవన్లో ఎస్సీ కార్పొరేషన్ ఎండీ కరుణాకర్, జీఎం ఆనంద్తో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఎస్పీ కార్పొరేషన్ ద్వారా అమలవుతున్న పథకాలను, అందజేస్తున్న సబ్సిడీ రుణాలు, యువతకు అందిస్తున్న ఉపాధి శిక్షణ కార్యక్రమాలపై అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమిళనాడు బృందానికి వివరించారు. దళితబంధు పథకం విశిష్టతలను వివరించారు.