పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 6: తొలి తెనుగు విప్లవ కవి పాల్కురికి సోమనాథుడి అతి ఎత్తయిన విగ్రహాన్ని జనగామ జిల్లా పాలకుర్తిలో ఏర్పాటు చేశారు. పాలకుర్తిలో పర్యాటక అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రూ.10 కోట్లు మంజూరుచేశారు. మంత్రి ఎర్రబెల్లి సైతం కొన్ని నిధులు కేటాయించారు. 40 అడుగుల స్థూపంపై 12 అడుగుల ఎత్తైన సోమనాథుడి విగ్రహాన్ని మంగళవారం ప్రతిష్ఠించారు.