వేములవాడ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని నాగ్పూర్ ఈఎన్సీ అనిల్ బహుదూరె అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టును అ మహారాష్ట్ర ప్రభుత్వ ఇంజినీర్ల బృందం
అధ్యయనం చేస్తున్నది.
ఆదివారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మహారాష్ట్ర ప్రభుత్వ ఇంజినీర్ల బృందం నాగ్పూర్ ఈఎన్సీ అనిల్ బహుదూరె 15 మంది ఇంజినీర్ల బృందం ప్రాజెక్టులను సందర్శించారు. ఈ సందర్భంగా ఈఎన్సీ అనిల్ బహుదూరె వేములవాడలో మీడియాతో మాట్లాడారు.
ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా కాళేశ్వరం ప్రాజెక్టు ఉండటం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నేషనల్ మీడియాలో కూడా ఎన్నో కథనాలు వచ్చాయి. ఇంత గొప్పగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును అధ్యయనం చేయడం కోసం 15 మంది బృందంతో ఇక్కడికి వచ్చామని ఆయన తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం. సాగు, తాగునీటి రంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇంజినీర్ల బృందం పని తీరు ఎంతో ఆదర్శవంతంగా ఉందని ఆయన ప్రశంసించారు.