హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగా ణ): తెలంగాణ మరో ఘనత సాధించింది. స్వచ్ఛభారత్ మిషన్లో భాగం గా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మరుగుదొడ్ల రెట్రోఫిటింగ్లో రాష్ట్రం టాప్లో నిలిచింది. సింగిల్ పిట్లు గల మరుగుదొడ్లు 100% డబుల్పిట్లుగా అభివృద్ధి చేశారు. దేశవ్యాప్తంగా 10 లక్షల మ రుగుదొడ్లను సింగిల్ పిట్ నుంచి డబుల్ పిట్ కు మార్చగా, అందులో తెలంగాణ నూరుశాతం లక్ష్యాన్ని సాధించింది. ‘రెట్రోఫిట్ టు ట్విన్ పిట్’ కార్యక్రమంలో నూరుశాతం లక్ష్యాన్ని చేరుకున్న తెలంగాణతోపాటు టాప్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాలను స్వచ్ఛ భారత్ మిషన్ అభినందించింది. తన అధికారిక ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపింది.
టాయిలెట్ల రెట్రో ఫిట్టింగ్లో 100 శాతం లక్ష్యాన్ని సాధించిన తెలంగాణతోపాటు టాప్లో మూడు రాష్ర్టాలు నిలిచినట్టు కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. ఈ రాష్ర్టాలు సాధించిన ఫలితాలను ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ర్టాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తామని ఆయన గురువారం ట్విట్టర్లో తెలిపారు.