పెద్దపల్లి : కాంగ్రెస్ మూడు నెలలలో పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా హాస్టల్ విద్యార్థులు(Hostel students) సుమారు మూడు కిలోమీటర్లు నడిచి వచ్చి ప్రధాన రహదారిపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..పెద్దపల్లి(Peddapalli) జిల్లా మంథని మండలం వెంకటాపూర్ గ్రామంలో గల బీసీ గురుకుల విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.
హాస్టల్లో సరైన వసతులు లేవని అధికారులకు, నాయకులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన విద్యార్థులు తిరుగుబాటును ప్రకటించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు కదిలేది లేదని మంథని-కాటారం రహదారిపై రోడ్డుపై ధర్నా(Dharna) చేపట్టారు. వెంకటాపూర్ నుంచి హాస్టల్ షిఫ్ట్ చేయాలని, మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థులను సముదాయిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.