ఖమ్మం అర్బన్, మార్చి 7: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన ఘటన ఖమ్మం నగరం ఖాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం చేసుకున్నది. వివరాలిలా ఉన్నాయి. పాఠశాలలోని 6, 7, 8, 10వ తరగతులకు చెందిన విద్యార్థినులు తమను హిందీ ఉపాధ్యాయుడు అర్షద్పాషా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో శనివారం పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు.
పోలీసులు అక్కడికి చేరుకుని తల్లిదండ్రులను సముదాయించగా వారు మరింత ఆగ్రహం వ్యక్తంచేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు. సదరు ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ధర్నా చేశారు. ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనపై హెచ్ఎం, ఎంఈవోలు డీఈవోకు ప్రాథమిక నివేదికను అందజేశారు. దీంతో ఉపాధ్యాయుడు అర్షద్పాషాను సస్పెండ్ చేస్తూ డీఈవో చైతన్య జైనీ ఉత్తర్వులు జారీ చేశారు.