హైదరాబాద్, ఆగస్టు 20 : మేడారం(Medaram) సమ్మక్క-సారలమ్మ మహా జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించబోయే మేడారం మహా జాతరకు ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మంజూరు చేసిన నిధుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లూ భట్టి విక్రమార్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ లకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.