సంగారెడ్డి : ఎలాంటి పని చేయకుండా తిరుగుతున్నాడని తండ్రి కొడుకును మందలించడంతో మనస్థాపానికి గురైన కొడుకు పురుగుల మందు తాగి(Drank insecticide) మృతి(Suicide) చెందాడు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లా గుమ్మడిదల(Gummadidala) మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.గుమ్మడిదల మండల కేంద్రానికి చెందిన పిట్ల బాలేష్ చిన్న కుమారుడు పిట్ల నవీన్(24) గత కొన్ని రోజుల నుంచి ఎలాంటి పని చేయడం లేదు.
తనకు ఖర్చుల కోసం నగదు ఇవ్వాలని తండ్రిని కోరగా తనవద్ద డబ్బులు లేవని చెప్పాడు. పని చేసి డబ్బులు సంపాదించుకోవాలని మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన నవీన్ వారి పొలం వద్దకు తాను పురుగుల మందు తాగి చనిపోతున్నానని మొబైల్ ద్వారా వీడియోను తన అక్కకు పంపాడు. వెంటనే కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని మల్లారెడ్డి దవాఖానకు అంబులెన్స్లో తరలించారు. చికిత్స పొందుతూ ఆదివాం మృతి చెందాడు. నవీన్ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.