హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరికొందరి పాత్రపై సిట్ ఆరా తీస్తున్నది. ఈ కేసులో ఇప్పటివర కు 28 మందిని నిందితులుగా చేర్చిన సిట్.. 27 మందిని అరెస్టు చేసింది. తాజాగా ఇద్దరు మధ్యవర్తులు మనోజ్, మురళీధర్, వారి నుంచి ఏఈ, ఏఈఈ పేపర్లను కొనుగోలు చేసి పరీక్ష రాసిన నాగర్కర్నూల్కు చెందిన ఆది సాయిబాబు, ముడావత్ శివకుమార్, నాగార్జునసాగర్కు చెందిన మహేశ్, ఖమ్మం వాసి పొన్నం వరుణ్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
మధ్యవర్తులు మరికొందరికి కూడా పేపర్ను విక్రయించి ఉంటారనే కోణంలో సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. తాజా నిందితుల కాల్డాటా, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు.