హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): నేషనల్ ప్రైవేట్ సెక్యూరిటీ డే సందర్భంగా ఆదివారం సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఎస్ఏటీ) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బంజారా భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఏటీ, సెక్యూరిటీ ఏజెన్సీ యాజమాన్యాలు.. హోం మంత్రికి వినతిపత్రం అందజేశాయి. రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, వెయ్యి ఏజెన్సీలు ఉన్నాయని తెలిపారు. వీరికి నైపుణ్యం పెంపొందించేందుకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఏటీ చైర్మన్ డీఎస్ రెడ్డి, వైస్ చైర్మన్ మురహరి గౌడ్, అధ్యక్షుడు శ్రీకాంత్ జాదవ్, ప్రధాన కార్యదర్శి బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.