నిజామాబాద్ :నందిపేట మండలం చౌడమ్మ కొండూరులో రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ, ప్రతిష్ఠాపన రెండో రోజు కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత దంపతులు హాజరై పూజలు నిర్వహించారు. ఇవాళ ప్రాతారాధన, సేవాకాలం, ద్వారతోరణ ధ్వజకుంభ ఆరాధన, చతు:స్థానార్చన, అరని మథనం తదితర కార్యక్రమాలను తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఆలయాలు మానవజాతికి జీవనాడిగా ఉంటున్నాయని అన్నారు. కోటి కొత్త ఆలయాలు నిర్మించడం కన్నా ప్రాచీన ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం ధార్మికమైన కార్యమని పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్, నాయకులు రాంకిషన్ రావు, తారిఖ్ అన్సారీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.