హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : సర్కారీ బడుల్లో చదువుతున్న బాలికల భద్రతకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. బాలికల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపేందుకు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ను నేర్పించేందుకు సిద్ధమైంది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా 4,066 బడులను ఎంపికచేసింది. మూడు నెలల పాటు ఇవ్వనున్న ఈ శిక్షణ ఈ నెల నుంచే ప్రారంభంకానున్నది. ఇందుకు రూ. 6.09 కోట్ల నిధులను కూడా విద్యాశాఖ మంజూరు చేసింది.
శిక్షణలో భాగంగా ఆపదలో తమను తాము రక్షించుకొనేందుకు బాలికలకు ఆత్మరక్షణ టెక్నిక్స్ నేర్పిస్తారు. కుంగ్ ఫూ, కరాటే, జూడో లాంటి మార్షల్ ఆర్ట్స్తోపాటు, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై బాలికలకు ప్రత్యేక అవగాహన కల్పిస్తారు. జిల్లా క్రీడల అభివృద్ధి సంస్థ సహకారాన్ని తీసుకొని.. అర్హతలున్న మహిళా ట్రైనర్లనే శిక్షకులుగా నియమిస్తారు.