హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో ఫోటో గ్రాఫర్స్ పాత్ర ఎంతో గొప్పదని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ అన్నారు. వరల్డ్ ఫొటోగ్రఫీ డే ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, కాంటెస్ట్ను రవీంద్రభారతిలో ప్రారంభించారు. ఫొటో గ్రాఫర్స్ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ లో ప్రదర్శించిన ఫొటోలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఫొటోగ్రాఫర్స్ కు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టులకు ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి కోవిడ్ సమయంలో వారి కుటుంబాలకు బాసటగా నిలిచారన్నారు. ఒక్క ఫొటో లక్ష మెదళ్లను కదిలిస్తుందన్నారు. ఫొటోగ్రాఫర్స్ కు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జర్నలిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఫొ టోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్ ధర్మాన, కార్యదర్శి రజనీకాంత్ గౌడ్, కోశాధికారి శివకుమార్, సభ్యులు నగర గోపాల్, వెంకట్, సతీష్, శ్రీను, దీపక్ దేశ్ పాండే, అలీ, రాజేశ్వర్, జి. శ్రీను తదితరులు పాల్గొన్నారు.