హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): సవరించిన అడిషనల్ డీఎంఈల మెరిట్ జాబితాను వైద్యారోగ్యశాఖ విడుదల చేసింది. అభ్యంతరాలుంటే ఈ నెల 29లోపు అందజేయాలని డీఎంఈ త్రివేణి గురువారం ఉత్తర్వులిచ్చారు.
ప్రస్తుతం డీఎంఈ, డీఎంఈ (అకడమిక్) పోస్టుల్లో ఇంచార్జీలు కొనసాగుతున్నారు. సీనియార్టీని పక్కనబెట్టి జూనియర్లను డీఎంఈలుగా నియమించడంపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు వచ్చే నెల 5న విచారణ చేపటనున్నది.