TS ECET Results | హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : టీఎస్ ఈసెట్ ఫలితాలు మంగళవారం విడుదలకానున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వీ వెంకటరమణ, ఓయూ వీసీ డీ రవీందర్ ఫలితాలను రిలీజ్ చేస్తారు.
పాలిటెక్నిక్, బీఎస్సీ (గణితం) పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్లో ర్యాంకుల ఆధారంగా బీటెక్ కోర్సుల్లో ల్యాటరల్ ఎంట్రీ (రెండో సంవత్సరంలో) ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది మే 20న నిర్వహించిన టీఎస్ ఈసెట్కు 22,454 మంది విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.