హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వైద్యారోగ్య రంగం పటిష్ఠంగా ఉన్నదని రిజర్వ్బ్యాంక్ నివేదిక ధ్రువీకరించింది. తాజాగా విడుదల చేసిన హ్యాండ్బుక్లో రాష్ట్రంలో జననాల రేటు, మరణాల రేటు తగ్గిందని వెల్లడించింది. రాష్ట్రంలో నవజాత శిశు మరణాల రేటు ఆరేండ్లలో 40%, మాతృ మరణాల రేటు ఐదేండ్లలో 30% తగ్గినట్టు వెల్లడించింది.