మహదేవపూర్, ఫిబ్రవరి 29: కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్లో మరమ్మతు పనులు నత్తనడకన సాగుతున్నాయి. బరాజ్లోని ఏడో బ్లాక్లో కుంగిన 19, 20, 21వ పియర్లతోపాటు ఇతర బ్లాక్లలో పేరుకున్న ఇసుక, మట్టిని ఎల్అండ్టీ సంస్థ కార్మికులు యంత్రాల సహాయంతో తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు.
బరాజ్ అప్స్టీమ్, డౌన్ స్టీమ్లో కరకట్ట నిర్మాణ పనుల కోసం మట్టిని తరలించి బరాజ్కు సమాంతరంగా మట్టి కరకట్ట వేస్తున్నారు. కుంగిన పియర్ల చుట్టూ నీరు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్వలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ శుక్రవారం ‘చలో మేడిగడ్డ’ నేపథ్యంలో అధికారులు తూతూమంత్రంగా పనులు నిర్వహిస్తున్నారు.