మహదేవపూర్, ఆగస్టు 15 : జయశంకర్ భూపాలపల్లి మండలం మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని లక్ష్మీ బరాజ్లోకి వరద క్రమంగా తగ్గుతున్నది. ఆదివారం 7,71,580 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా.. సోమవారం ఇన్ఫ్లో 5,52,600 క్యూసెక్కుల వరద వస్తోంది. బరాజ్లోని గేట్లన్నీ(85) ఎత్తి, అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు భారీ నీటి పారుదల శాఖ డీఈ సురేశ్ వెల్లడించారు.