హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 23 వరకు రైలు మ్యూజియం సందర్శనకు ఉచిత ప్రవేశం కల్పించినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో కాచిగూడ రైల్వేస్టేషన్లోని రైలు మ్యూజియంలో గురువారం ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్సీఆర్ అదనపు జనరల్ మేనేజర్ ఆర్ ధనంజయులు ఉత్సవాన్ని ప్రారంభించారు.