కడ్తాల్, జూలై 25: ధ్యాన గురువు, ది పిరమిడ్ స్పిరిచువల్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సుభాశ్ పత్రీజీ అంతిమ వీడ్కోలు ఆశ్రునయనాల మధ్య ముగిసింది.
సోమవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలోని మహేశ్వర మహా పిరమిడ్ ఆవరణలోని ప్రధాన వేదిక మీద ఉంచిన పత్రీజీ పార్థీవదేహాన్ని చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు తరలివచ్చారు. పత్రీజీ భౌతికకాయం వద్ద నివాళి ఆర్పించి, అంతిమయాత్రలో పాల్గొన్నారు.