హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ కమిటీ హాల్లో మంగళవారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమావేశం చైర్మన్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన నిర్వహించారు. జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ ఆడిట్ ఫారాలపై చర్చించారు. ఆడిట్ ఫారాలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు అక్బరుద్దీన్ సూచించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, సండ్ర వెంకటవీరయ్య, జైపాల్యాదవ్, రవీంద్రకుమార్ పాల్గొన్నారు. వీరితో పాటుగా ఏజీలు సుధారాజన్, సలోని జైన్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నర్సింహాచార్యులు పాల్గొన్నారు.