కుంటాల, డిసెంబర్ 1: నిర్మల్ జిల్లా కుం టాల మండలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సం గ్రామ యాత్రకు ప్రజల నుంచి ఆశించిన స్పందనలేదు. లింబా(బీ)లో బండి సంజయ్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానికులు ఆయన ప్రసంగం వినేందుకు ఆసక్తి చూపలేదు. యాత్ర ఆయా గ్రామాల మీదుగా సాగిన ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. బీజేపీ నాయకులు, కార్యకర్తలు మినహా ప్రజలెవ్వరూ కనిపించలేదు. ప్రజల మద్దతు లేకపోవడంతో భైంసా పరిసరాలతోపాటు నిర్మల్, ఆదిలాబాద్ నుంచి బీజేపీ శ్రేణులు పాదయాత్రలో పాల్గొన్నారు.