హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. వీళ్లతో సంబంధాలున్న మరో నలుగురికీ నోటీసులు జారీచేశారు. డ్రోన్ల ద్వారా గ్రెనేడ్లను సరిహద్దుకు పంపించి, అక్కడి నుంచి స్లీపర్ సెల్స్ ద్వారా హైదరాబాద్కు చేర్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నగరంలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ నుంచి రూ.30 లక్షలు ఆర్థిక సాయం అందినట్టు గుర్తించారు. మూసారాంబాగ్కు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాది షాహెద్ బిలాల్ సోదరులే ఉగ్ర కుట్రలో కీలకభూమిక పోషిస్తున్నారని సమాచారం. సీసీఎస్ నేతృత్వంలోని సిట్ బృందం అబ్దుల్ జాహెద్ అలియాస్ మోటూ(షాహెద్ బిలాల్ సోదరుడు), సైదాబాద్కు చెందిన మహ్మద్ సమీయుద్దీన్ అలియాస్ అబ్దుల్ సమీ, మెహిదీపట్నానికి చెందిన మాజ్హసన్ ఫారూఖీ అలియాస్ మాజ్ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసి, రూ.5.41 లక్షలు స్వాధీనం చేసుకొన్న విషయం తెలిసిందే.
పాకిస్తాన్ నుంచి ఆదేశాలు
దేశంలోని పలు పేలుళ్లతో సంబంధాలున్న హైదరాబాద్కు చెందిన ఉగ్రవాదులు పాకిస్తాన్కు పరారై ఐఎస్ఐతోపాటు జైషేమహ్మద్, హర్కతుల్ జిహాదీ వంటి ఉగ్ర సంస్థల్లో చేరా రు. వీరిలో హైదరాబాద్కు చెందిన ఫర్హతుల్లా ఘోరీ అలియాస్ ఎఫ్జీ, సిద్దిఖీ బిన్ ఉస్మాన్ అలియాస్ రఫీక్, అబ్దుల్ మాజీద్ అలియాస్ చోటు (షాహెద్ బిలాల్ చిన్న సోదరుడు) ఉన్నారు. వీరు హైదరాబాద్లో ఉన్నవారికి ప్రలోభాలు చూపించి ఉగ్ర సంస్థల్లో చేరేం దుకు ప్రోత్సహించారు. ప్రస్తుతం పాకిస్తాన్ నుంచి ఆదేశాలిచ్చిన త్రయంలో మాజీద్ ఒక డు కావడం గమనార్హం. మెహిదీపట్నానికి చెందిన మాజ్ హసన్ ఫారూఖీ సిరియాలోని ఐఎస్ ప్రతినిధులతో పరిచయం చేసుకొని దేశం దాటిపోయేందుకు రెండుసార్లు ప్రయత్నించాడు. మొదటిసారి కోల్కతా, మరోసారి నాగపూర్లో పోలీసు లు అతనిని పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ విషయాన్ని గుర్తించిన జాహెద్.. ఫారూఖీని తన ఉగ్ర బృందంలో చేర్చుకొన్నాడు. వీరిచేత జనాలు గుంపుగా ఉన్న చోట సులువుగా విసిరే విధంగా తేలికపాటి హ్యాండ్ గ్రెనేడ్లను డ్రోన్లు, స్లీపర్ సెల్స్ ద్వారా హైదరాబాద్కు తరలించినట్టు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతోనే నిందితులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో టాస్క్ఫోర్స్, సిట్ సిబ్బంది అరెస్టు చేశారు.