హుజూరాబాద్ టౌన్, జూలై 19: బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా హుజూరాబాద్ గడ్డ మీద గులాబీ జెండాఎగరడం ఖాయమని తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులు స్పష్టంచేశారు. ప్రజా చైతన్యయాత్రలో భాగం గా హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలు, జమ్మికుంట మండలంలోని నాగారం, నగురం, వీణవంక మండలం లోని ఇప్పలపల్లి, మామిడాలపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేంద్రం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. రానున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే హుజూరాబాద్ సమగ్ర అభివృద్ధికి బాటలు వేసిన వారమవుతామని సూచించారు. మతతత్వ పార్టీ బీజేపీకి తెలంగాణలో మనుగడ లేదని, ఉప ఎన్నికలో నెగ్గి ప్రజల్లో మత ప్రభావాన్ని చూపెట్టేందుకు పూనుకుంటుందని ఆరోపించారు. కార్యక్రమంలో హుజూరాబాద్ ఇంచార్జి, ఓయూ జేఏసీ అధ్యక్షుడు జింకల పర్వతాలుయాదవ్, కరుణాకర్రెడ్డి, దశరథ్, అవినాశ్, పరశురాం, చందు, అనిల్, శివ, భరత్ తదితరులు పాల్గొన్నారు.