సూర్యాపేట టౌన్, మే 25: గులాబీ జెండాయే అందరికీ అండ అని, సీఎం కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రనికి శ్రీరామరక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఎనిమిదేండ్లుగా జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని స్పష్టంచేశారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూర్.ఎస్ మండలం రామన్నగూడేనికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మెట్టు రాంరెడ్డి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బుధవారం టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో ఇప్పటికే విపక్షాలు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఆయా పార్టీల్లో మిగిలిన వారు సైతం కారెక్కడం ఖాయమని పేర్కొన్నారు.