చమురు సంక్షోభం హైదరాబాద్ను తాకింది. సీఎన్జీతోపాటు పెట్రోల్, డీజిల్కూ తీవ్ర కొరత ఏర్పడటంతో చాలావరకు బంకులు మంగళ వారం నోస్టాక్ బోర్డులు పెట్టేశాయి. దీంతో నగరవాసుల్లో ఆందోళన మొదలైంది.
ఇంధనం కోసం వాహనదారులు పోటెత్తడంతో పలు బంకుల్లో కిలోమీటర్ల మేర బారులు కనిపించాయి. మరోవైపు రాష్ట్రంలో ఇంధన కొరత లేదంటూ పౌరసరఫరాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.