హైదరాబాద్, మార్చి 16(నమస్తే తెలంగాణ): బీ జేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా, సంక్షేమం, మత సామరస్యం, సామాజిక న్యాయం కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఈ నెల 29 వరకు జనచైతన్య యాత్రలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. హైదరాబాద్లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన యాత్ర వివరాలను వెల్లడించారు.
రాజ్యాంగ హక్కు ల పరిరక్షణకు సీపీఎం కేంద్ర కమిటీ చేపట్టే ప్రచార కార్యక్రమం రాష్ట్రంలోని మూడుచోట్ల ప్రారంభించనున్నట్టు తెలిపారు. శుక్రవారం వరంగల్లో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, 23న ఆదిలాబాద్లో సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, 24న నిజామాబాద్లో మాజీ ఎంపీ విజయరాఘవన్ కార్యక్రమాలను ప్రారంభిస్తారని వివరించారు. 29న హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద జనచైతన్య యాత్ర ముగింపు సభ నిర్వహిస్తామని చెప్పా రు. ఈ కార్యక్రమానికి తమ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు ప్రకాశ్కారత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తమ్మినేని వీరభద్రం వివరించారు.