హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలో(Siddipet) దారుణం చోటు చేసుకుంది. ఓ చికెన్ సెంటర్ యజమాని(Chicken center owner) దారుణ హత్యకు(Brutal murder) గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. జగదేవ్పూర్లోని వినాయక గుడి దగ్గర గల రాంరెడ్డి చికెన్ సెంటర్ యజమాని మహిపాల్ రెడ్డి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. చికెన్ సెంటర్లోనే గాయాలతో అతడి మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు తూప్రాన్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. చికెన్ సెంటర్ లో పని నిచేసే వారు హతమార్చి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.