హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ల పదోన్నతుల్లో లోటుపాట్లు, అవకతవకలపై విచారణ చేపట్టాలని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు గురువారం ఔటా నేతలు.. విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డిని, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రిని కలిసి వినతిపత్రాలు అందజేశారు.
యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా, పక్షపాత పూరితంగా వ్యవహరిస్తూ పదోన్నతుల విషయమై అవకతవకలకు పాల్పడ్డారని తెలిపారు. దీనిపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఔటా అధ్యక్షుడు మనోహర్ విజ్ఞప్తి చేశారు.