హైదరాబాద్ సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ): ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైలు సర్వీసులను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. శనివారం, ఆదివారం కలిపి మొత్తం 23 రైళ్లను రద్దు చేశారు.
ఆదివారం నడువాల్సిన తిరుపతి-హౌరా ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు. ఈ నెల 6న గువాహటి-బెంగుళూరు ఎక్స్ప్రెస్, 7న కామాఖ్య-బెంగుళూరు సర్వీసును కూడా క్యాన్సిల్ చేసినట్టు అధికారులు తెలిపారు. మరో 26 రైళ్లను దారి మళ్లించామని, షాలిమార్ ఎక్స్ప్రెస్ మూడు గంటల రీషెడ్యూల్ చేశారు.