హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): మేడే సందర్భంగా కార్మికులకు సోమవారం మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
‘పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్యం శ్రమించే నిజమైన హీరోలైన కార్మికులకు మేడే శుభాకాంక్షలు’ అని కేటీఆర్, ‘కార్మిక లోకానికి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు’ అని హరీశ్రావు, ‘పట్టుదల, కృషితో అభివృ ద్ధి వైపు వేసిన ప్రతి అడుగు విజయం సాధిస్తుంది.. కార్మిక సోదరసోదరిమణులకు మేడే శుభాకాంక్షలు’ అని కవిత ట్వీట్ చేశారు.