హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : వేసవి కాలంలో రైలు ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
హైదరాబాద్-కటక్, సికింద్రాబాద్-ఉదయ్పూర్ మధ్య పది ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 16 నుంచి 30 వరకు షెడ్యూల్ వారీగా ప్రత్యేక రైళ్లు నడుస్తాయని మంగళవారం రైల్వే అధికారులు తెలిపారు.