రాజన్న సిరిసిల్ల : వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో కిటకిట లాడింది. వేకువజాముననే భక్తులు స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. ఆలయ కళాభావన్లో భక్తులు కళ్యాణాల మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్నను దాదాపు 50 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నాయరని ఆలయ అధికారులు వెల్లడించారు.
గీతా జయంతి ఉత్సవాల సందర్భంగా రాజన్న ఆలయంలో మొదటి రోజు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ అనుబంధ దేవాలయాలలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకున్నారు.