హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్1 రెస్పాన్స్ షీట్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం రాత్రి విడుదల చేసింది. దీన్ని జేఈఈ మెయిన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు ఈ నెల 8లోపు రూ.200 రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. జాతీయంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్స్1 పరీక్ష గత జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.