హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రక్తహీనతకు ప్రధాన కారణమైన ఐరన్, అయోడిన్ లోపాన్ని ఫోర్టిఫైడ్ ఉప్పు వినియోగంతో అధిగమించవచ్చని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) తేల్చింది. మేఘాలయలోని ఓ జిల్లాలో గర్భిణుల ఆహార అలవాట్లు, ఫోర్టిఫైడ్ ఉప్పు వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై ఏడాదిపాటు అధ్యయనం జరిపి ఈ విషయాన్ని గుర్తించింది.
ఆహార తయారీకి సాధారణ ఉప్పు కంటే ఐరన్, అయోడిన్ కలిసిన ఫోర్టిఫైడ్ ఉప్పును ఉపయోగించడం ఎంతో శ్రేయస్కరమని స్పష్టం చేసింది. ఈ ఉప్పును వినియోగించిన గర్భిణుల్లో 80 శాతం మందికి రక్తహీనత సమస్యలేవీ లేవని అధ్యయనంలో తేలినట్టు వెల్లడించింది.