హైదరాబాద్, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ కీపై అభ్యంతరాల గడువును పొడిగించినట్టు జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) తెలిపింది. జేఈఈ మెయిన్ సెషన్ పరీక్షల రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీలను మంగళవారం విడుదల చేసిన ఎన్టీఏ అధికారులు కీలో అభ్యంతరాలకు గురువారం వరకు అవకాశం కల్పించారు.
సర్వర్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన దృష్ట్యా శుక్రవారం నాటికి పెంచినట్టు ఎన్టీఏ తెలిపింది. దీంతో అభ్యర్థులు పరీక్ష పత్రాలను ప్రాథమిక కీతో సరిపోల్చుకుని అభ్యంతరాలను శుక్రవారం రాత్రి 11 గంటలలోపు తెలిపే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.