Hyderabad | హయత్నగర్, మే 30: హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మృతి ఘటనపై మిస్టరీ కొనసాగుతోంది. రాజేశ్ మృతికి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సుజాత ఆత్మహత్యకు మధ్య సంబంధం ఉందని భావిస్తున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 29న కుంట్లూరు వద్ద కుళ్లిన స్థితిలో రాజేశ్ మృతదేహం లభ్యమైంది. కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా పంచోటుకులపల్లికి చెందిన రాజేశ్ బీటెక్ పూర్తి చేసి దిల్సుఖ్నగర్ చైతన్యపురి కాలనీలోని ఓ ప్రై వేటు హాస్టల్లో ఉంటున్నాడు. పెండ్లికి ఇబ్రహీంపట్నం వెళ్తున్నట్టు స్నేహితుడు సాయి ప్రకాశ్కు చెప్పి 22న హాస్టల్ నుంచి బటయపడ్డాడు. 29న అతడి మృతదేహం కుళ్లిన స్థితి లో ఉంది. దానిపక్కన కండోమ్ ప్యాకెట్లు, ప్యాంటు, పర్సు, సెల్ఫోన్, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హయత్నగర్ డివిజన్లోని సిద్ది వినాయకనగర్ కాలనీకి చెందిన సుజాతకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సుజాత నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నది. ఆమె భర్త కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే. 6నెలల క్రితం మిస్డ్ కాల్ ద్వారా రాజేశ్తో ఆమెకు పరిచయమైం ది. అది మరింత ముదరడంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని రాజేశ్ భావించాడు. ఆమెకు వివాహమై పిల్లలు ఉన్నారని తెలియడంతో రెండు నెలల క్రితం దూరం పెట్టాడు.
రాజేశ్ తనను దూరం పెట్టడంతో మనస్తాపానికి గురైన సుజాత చనిపోతానంటూ ఈ నెల 24న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ 29న మృతి చెందింది. విషయం తెలియని రాజేశ్ ఆమెకు పదేపదే ఫోన్ చేయడం, వాట్సాప్ మెసేజ్లు పంపడంతో అనుమానించిన సుజాత కుటుం బ సభ్యులు రాజేశ్ను కలిసి హెచ్చరించారు. సుజాత మృతి విషయం తెలిసి భయపడిన రాజేశ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. సుజాత భర్త, కుమారుడు, అతడి స్నేహితులను ప్రశ్నిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే హత్యా? ఆత్మహత్యా? అన్న విషయం.. స్పష్టత వస్తుందని హయత్నగర్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.