హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన వ్యవసాయ మార్కెట్ను నిర్మిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో శుక్రవారం ఆయన కోహెడ మార్కెట్ మాస్టర్ప్లాన్పై అధికారులతో సమీక్షించారు. స్పెయిన్లోని మార్క్మాండ్రిడ్, ఫ్రాన్స్లోని రుంగిస్ వంటి అధునాతన అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న వసతులు, ఉత్తమ విధానాలను తీసుకొని కోహెడ మార్కెట్ మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని సూచించారు.
మార్కెట్లో వేలం జరిగే షెడ్లలో ఊష్ణోగ్రతలు తగ్గించేందుకు, పండ్ల నిల్వ కాలం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మారెట్లో వేలం నిర్వహించేందుకు 11 భారీ షెడ్లు నిర్మించనున్నట్టు చెప్పారు. కమీషన్ ఏజెంట్లు, వ్యాపారస్తులకు కేటాయించేందుకు పండ్లు, ఎండు మిర్చి, ఉల్లి కోసం 820 షాపులు నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు. కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి 20 ఎకరాలు, పండ్ల మారెట్ కోసం 78.78 ఎకరాలు కేటాయించినట్టు వెల్లడించారు. ఎగుమతుల మారెటింగ్ కోసం ప్రత్యేక వసతులతో 19.75 ఎకరాలు, ఎండు మిర్చి మారెట్కు 27.35 ఎకరాలు, ఇతర వసతులకు 73.24 ఎకరాలు కేటాయించినట్టు చెప్పారు. మలక్పేటలోని మిర్చి మారెట్ను పూర్తిస్థాయిలో బదిలీ చేసేందుకు వీలుగా కోహెడలో అవసరమైన వసతులు కల్పించాలని నిర ్ణయించినట్టు తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతు, మారెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఇంజినీర్లు పాల్గొన్నారు.