హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈనెల మొదటి వారం నుంచే ఎండలు మండుతున్నాయని, హోలీ తర్వాత నిప్పుల కొలిమిని తలపించనున్నదని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈనెల నుంచి మేనెల వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని వెల్లడించింది. వడగాల్పులు తీవ్రత పెరుగడంతోపాటు, హైదరాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించింది.