జనగామ, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగా ణ): జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన మెగా జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. c, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నియోజకవర్గ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జాబ్ మే ళాకు పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, తొర్రూ రు, రాయపర్తి, పెద్దవంగర మండలాలు సహా జిల్లావ్యాప్తంగా నిరుద్యో గ యువతీయువకులు పోటెత్తారు. పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఒకో కంపెనీ కౌంటర్ వద్ద కు వెళ్లి ఎంపిక ప్రక్రియను పరిశీలించారు. ఉ ద్యోగార్థులతో ముచ్చటించి వారి అర్హతలు, అవకాశాలపై చర్చించారు.
ఉద్యోగార్థులకు, వారి వెంట వచ్చిన వారికి మంత్రి స్వయంగా భోజనాలు వడ్డించారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఈ మేళాలో ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్, హాస్పిటల్ ఇండస్ట్రియల్, సాఫ్ట్వేర్, మారెటింగ్, ఫైనాన్స్, అపోలో, ఎంపవర్మెంట్ సర్వీసెస్, విప్రో, అమేజాన్, ప్లిప్కార్ట్ లాంటి 80 కంపెనీలు పాల్గొన్నాయని చెప్పారు. జనగామ జిల్లా, ప్రత్యేకంగా పాలకుర్తి నియోజకవర్గం నిరుద్యోగులకు ఇది మంచి అవకాశమని, దీనిని అనేక మంది సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 80 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ ప్రక్రియను పూర్తి చేశారని తెలిపారు.
ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.12,000 నుంచి రూ.40 వేల వరకు జీతభత్యాలు ఉంటాయని, ఉద్యోగాల్లో చేరిన తర్వాత పని, అనుభవంతో ఇంకా ఎకువ మొత్తంలో జీతభత్యాలు సంపాదించుకోవచ్చని సూచించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తిలో జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు కల్పించిన ఆయా కంపెనీలకు మంత్రి దయాకర్రావు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. ఇప్పటికే లక్షా 35 వేల ఉద్యోగాలను భర్తీ చేశారని, ఇంకా ఆయా శాఖల్లో ఖాళీలను గుర్తించి 90 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి దయాకర్రావు పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. జాబ్ మేళాకు మొత్తం 4,180 మంది హాజరు కాగా.. 2,434 మందికి ఉద్యోగాలు వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు.