హైదరాబాద్ : డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అధ్యక్షతన ప్రజా పాలన(Prajapalana)పై క్యాబినెట్ సబ్ కమిటీ( Cabinet Sub-Committee) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల హామీల అమల్లో భాగంగా ఈరోజు ఐదు గ్యారంటీల అమలుపై చర్చిస్తున్న సబ్ కమిటీ.