హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మెకానికల్ అసిస్టెంట్ ఇంజినీర్ రాత పరీక్షను గురువారం సజావుగా నిర్వహించారు. ఉదయం పేపర్1కు 4,832 మంది (43%), మధ్యాహ్నం పేపర్-2కు 4,831(43%) మంది అభ్యర్థులు హాజరయ్యారు.
రాష్ట్రంలో 833 ఏఈ, టీవో, జేటీవో ఉద్యోగాల భర్తీకి నిరుడు సెప్టెంబర్ 12న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.