హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): మెప్మా రిసోర్స్ పర్సన్ల(ఆర్పీ) గౌరవ వేతనాల పెంపు విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఆర్పీల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు రూప్సింగ్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మానుకోట సునీత అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రూప్సింగ్ మాట్లాడారు.
ఆర్పీలను గుర్తించి రూ.4,000 చొప్పున గౌరవ వేతనం అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని తెలిపారు. మరింతగా పెంచే అంశాన్ని సీఎం, మంత్రి కేటీఆర్ దృష్టికి తాను తీసుకెళ్తానని చెప్పారు.