మెదక్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా పేరూరు వద్ద గరుడ గంగ తీరాన వెలసిన సరస్వతీ మాత ఆలయ సమీపంలో మంజీర నది పుషరాలు శనివారం ప్రారంభమయ్యాయి. రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, స్నానాల గదులు, దుస్తులు మార్చుకోవడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మొదటి రోజు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, జిల్లా జడ్జి లక్ష్మీశారద పుషరాలకు హాజరై పూజలు చేశారు.
మంజీర పుష్కరాలు నిర్వహించడం ఎంతో గర్వంగా ఉన్నదని, తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి పుష్కరాలు జరుపుకోవడం సంతోషంగా ఉన్నదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. పుష్కర స్నానం పూర్వజన్మ సుకృతమని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. 12 ఏండ్ల క్రితం ఇకడ జరిగిన మంజీర తొలి పుషరాల్లో అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ పాల్గొన్నారని, తెలంగాణ వ్యాప్తంగా అన్ని నదుల పుషరాలను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.